RSR NEWS
Editor: Chintapalli Srinivasarao 9949291526
ఏలూరు, (తేదీ):
యువ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ రాష్ట్ర అభివృద్ధికి వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న నాయకుడు నారా లోకేష్ పేర్కొన్నారు. విద్య మరియు ఐటి రంగాల్లో ఆయన చేపడుతున్న సంస్కరణలు రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తున్నాయని చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ . ముఖ్యంగా విద్యా వ్యవస్థలో నాణ్యత పెంపు, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా యువతకు బలమైన భవిష్యత్ అందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.
చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ , నారా లోకేష్ ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలతో మరింత విజయవంతమైన నాయకుడిగా ఎదగాలని ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఆకాంక్షించారు.

