✍🏼RSR NEWS✍🏼
వెలగపూడి సచివాలయంలో రాజధాని రైతులకు అమరావతి అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబులి వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ వారి చేతుల మీదుగా పాదపూజలు ఘనంగా సన్మానించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ అమూల్యమైన భూములను త్యాగం చేసిన రాజధాని రైతులను గౌరవిస్తూ వెలగపూడి సచివాలయంలో పాదపూజలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థిని మరియు అమరావతి అంబాసిడర్ రాయబారిగా సేవలందిస్తున్న అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ పాల్గొని రైతులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని
అమరావతి నిర్మాణం కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చి చరిత్రలో నిలిచిపోయే త్యాగం చేశారని కొనియాడారు. రైతులు చేసిన ఈ త్యాగం అమూల్యమని పేర్కొంటూ అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
“
అమరావతికి జీవం పోద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ కనీసం రూ.116 చొప్పున సహాయం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు, స్థానిక ప్రముఖులు మరియు ప్రజలు పాల్గొన్నారు.




