✍🏼RSR NEWS✍🏼
🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
ఏలూరు, మార్చి 16:
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం మరియు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారని కొనియాడారు. ఆయన త్యాగస్ఫూర్తి ప్రతి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని సూచించారు.
అలాగే సమాజంలో ఐక్యత, సేవాభావం, నిస్వార్థ త్యాగం వంటి విలువలను పెంపొందించడంలో పొట్టి శ్రీరాములు గారి జీవితం మార్గదర్శకమని పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమం గంభీర వాతావరణంలో నిర్వహించబడింది.


