🙏🏼✍🏼Editor: Chintapalli Srinivasarao 9949291526🙏🏼✍🏼
ఏలూరు పట్టణంలోని తంగేళ్లమూడి గ్రామంలో గల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజలందరి శ్రేయస్సు, సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

